News September 1, 2024

IMD హెచ్చరికలు పట్టించుకోకుండా ఐపీఎస్‌లపై ప్రభుత్వం కక్ష సాధింపు: YCP

image

AP: రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తాయని ఆగస్టు 29నే IMD హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం రివ్యూ చేయలేదని వైసీపీ ఆరోపించింది. ఒక సినీ నటి వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీపై బురదజల్లుడు, ఐపీఎస్‌లపై వేధింపులు, కక్షసాధింపు కార్యక్రమాల్లో బిజీగా ఉందని మండిపడింది. సీఎం ఉదాసీనతతో భారీ వర్షాలను మంత్రులు పట్టించుకోలేదని, యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా ఉందని Xలో దుయ్యబట్టింది.

Similar News

News November 14, 2025

రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

image

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.

News November 14, 2025

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..

image

బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలను ఎన్డీయే నమోదు చేస్తోంది. ఎన్డీయే 130-160 సీట్ల వరకు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పాయి. కానీ వాటన్నింటినీ తలకిందులు చేస్తూ అధికార కూటమి 190 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ 70-100 గెలుస్తుందన్న సర్వేల అంచనాలు నిజం కాలేదు. ఎంజీబీ కేవలం 50 లోపు సీట్లలోనే లీడ్‌లో ఉండటం గమనార్హం.

News November 14, 2025

200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుంది: CBN

image

AP: బిహార్‌లో ఎన్డీయే ఘ‌న విజ‌యం దిశగా దూసుకెళ్తుండటంపై CM చంద్ర‌బాబు స్పందించారు. విశాఖ CII పార్ట్‌నర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుందని అన్నారు. ప్ర‌జ‌లంతా PM మోదీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దేశంలో ఇంత‌లా ప్ర‌జా న‌మ్మ‌కం పొందిన వ్య‌క్తి మోదీ త‌ప్ప మ‌రెవ‌రూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ శతాబ్దం న‌రేంద్ర మోదీది అని కొనియాడారు.