News December 3, 2024
జనవరి 10 వరకు ధాన్యం కొనుగోళ్లు
TG: జనవరి 10 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు తొందరపడి బయట అమ్ముకొని నష్టపోవద్దని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33,15,426 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా 4,68,874 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో నిజామాబాద్ టాప్లో ఉంది. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు రూ.6.347.40కోట్లు చెల్లించినట్లు, రూ.1,344 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News January 18, 2025
NTR వర్ధంతి.. సీఎం చంద్రబాబు నివాళులు
AP: నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని CM చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. స్త్రీలకు సాధికారతనిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో “అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం” అని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్’ అని పేర్కొన్నారు.
News January 18, 2025
చలికాలంలో అల్లం.. ఆరోగ్యానికి వరం
చలికాలంలో అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో టీ, సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
News January 18, 2025
వాట్సాప్లో కొత్త ఫీచర్.. స్టేటస్లకు మ్యూజిక్!
వాట్సాప్లో స్టేటస్లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ వచ్చింది. ఫొటోలకు 15 సెకన్లు, వీడియోలకు వాటి నిడివిని బట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఆడియో కోసం సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే.