News January 24, 2025
20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్

TG: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను CM రేవంత్ కోరారు. HYDలో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సీవరేజీ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
Similar News
News February 11, 2025
సల్మాన్-అట్లీ సినిమా రద్దు?

అట్లీ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ నటించాల్సిన సినిమా ఆగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కాల్సిన ఈ మూవీలో రజినీకాంత్ లేదా కమల్ హాసన్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాంబోలో మూవీ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్తో చేసే సినిమా కోసం అట్లీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News February 11, 2025
2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దీదీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ CM, TMC అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో AAPకు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్కు AAP మద్దతివ్వలేదు. అందుకే BJP గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ MLAల సమావేశంలో వ్యాఖ్యానించారు.
News February 11, 2025
CTలో బుమ్రా ఆడతాడా? తేలేది నేడే!

ఈనెల 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జట్టులో మార్పులకు ఇవాళ్టితో గడువు ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ఒకవేళ ఆయన ఈ టోర్నీకి దూరమైతే భారత జట్టుకు పెద్ద లోటే అని చెప్పవచ్చు.