News January 9, 2025
పెను విషాదం: తిరుపతి తొక్కిసలాటకు కారణమిదే..
వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పద్మావతి పార్క్లో ఉంచారు. అప్పుడే ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు. టోకెన్లు ఇచ్చేందుకే గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అలాగే క్యూలైన్ల వద్ద సిబ్బంది ఓవరాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణమని మరికొందరు భక్తులు మండిపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
Similar News
News January 19, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.
News January 19, 2025
TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు!
TG: సింగపూర్లో పర్యటిస్తున్న CM రేవంత్ బృందం మరో భారీ పెట్టుబడిని రాబట్టినట్లు CMO వెల్లడించింది. హైదరాబాద్లో కొత్త ఐటీ పార్కు ఏర్పాటుకు ₹450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాపిటా ల్యాండ్ సంస్థ ముందుకొచ్చిందని పేర్కొంది. దీని వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. నిన్న STT గ్లోబల్ డేటా సెంటర్ ₹3,500 కోట్ల పెట్టుబడితో ఆర్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకుంది.
News January 19, 2025
20న ట్రంప్ ప్రమాణం.. 21న అరెస్టులు!
డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను మూకుమ్మడిగా అరెస్టు చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాంటి వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతారని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అమెరికా వలసల విభాగం మాజీ అధికారి ఒకరు స్పందిస్తూ ట్రంప్ ప్రమాణం చేశాక 21నుంచే ఈ అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్రమంగా చొరబడ్డ వలసదారులను వెనక్కి పంపే చర్యలను ముమ్మరం చేస్తారన్నారు.