News December 31, 2024

సంక్రాంతి సినిమాల టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్?

image

సంక్రాంతి బరిలో ఉన్న 3 సినిమాల టికెట్ రేట్ల పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్‌ బెనిఫిట్ షోకు ₹600, మల్టీఫ్లెక్స్‌కు ₹175, సింగిల్ స్క్రీన్‌కు ₹135, డాకు మహారాజ్ బెనిఫిట్ షోకు ₹500, మల్టీఫ్లెక్స్‌లో ₹135, సింగిల్ స్క్రీన్‌కు ₹110 పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సింగిల్ స్క్రీన్‌లో ₹75, మల్టీఫ్లెక్స్‌లో ₹100 పెంపు ఉంటుందని సమాచారం.

Similar News

News January 25, 2025

జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్

image

జియో భారత్ ఫోన్లలో ‘జియో సౌండ్ పే’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోని 5కోట్ల మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని జియో ఇన్ఫొకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీత్ దత్ చెప్పారు. వినియోగదారుల ఆన్‌లైన్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు అవసరం లేదని, ఫ్రీగా ‘జియో సౌండ్ పే’తో ఫోన్‌లోనే మెసేజ్ వినొచ్చని తెలిపారు. దీంతో ప్రతి వ్యాపారికి ఏడాదికి రూ.1500 సేవ్ అవుతుందన్నారు.

News January 25, 2025

నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల

image

ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

News January 25, 2025

దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్

image

AP: దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు.