News January 11, 2025
ఏపీలో గ్రీన్కో రూ.35వేల కోట్ల పెట్టుబడులు: పవన్ కళ్యాణ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736594537865_695-normal-WIFI.webp)
AP: గ్రీన్ కో కంపెనీ దేశవ్యాప్తంగా ₹లక్షన్నర కోట్ల పెట్టుబడి పెడుతోందని Dy.CM పవన్ చెప్పారు. అందులో ₹35వేల కోట్లు రాష్ట్రానికే వస్తున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న సోలార్ పార్క్ను సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘2,800 ఎకరాల్లోని ఈ ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదు. దీనివల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రం కానుంది’ అని చెప్పారు.
Similar News
News January 14, 2025
హరియాణా BJP చీఫ్పై గ్యాంగ్ రేప్ కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736866938759_1124-normal-WIFI.webp)
హరియాణా BJP చీఫ్ మోహన్ లాల్ బడోలీపై హిమాచల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోటల్లో July 3, 2023న మోహన్ లాల్, సింగర్ రాఖీ మిట్టల్ తనపై అత్యాచారం చేశారని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇస్తానని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.
News January 14, 2025
నేషనల్ పాలిటిక్స్పైనే INDIA ఫోకస్: పవార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736862386531_1124-normal-WIFI.webp)
INDIA కూటమి కేవలం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తుందని, అసెంబ్లీ-స్థానిక ఎన్నికలపై కూటమిలో ఎలాంటి చర్చ లేదని NCP SP చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? కలిసి పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన UBT ఇప్పటికే ప్రకటించింది. స్థానిక ఎన్నికలు MVA పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి.
News January 14, 2025
అథ్లెట్పై అత్యాచారం.. 44 మంది అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736864010229_695-normal-WIFI.webp)
కేరళలో ఓ అథ్లెట్ బాలిక(18)పై ఐదేళ్లుగా 62 మంది కామాంధుల <<15126560>>లైంగిక వేధింపుల<<>> కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 44 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మృగాళ్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిందితులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.