News December 17, 2024
ముగిసిన గ్రూప్-2.. సగం మంది కూడా రాయలేదు!

TG: గ్రూప్-2 ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి. పేపర్-3 పరీక్షకు 45.62% మంది, పేపర్-4కు 45.57% మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం గమనార్హం. మొత్తం 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,51,486 మంది హాజరయ్యారు. పరీక్షలో చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన, పాత తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నలు చర్చకు దారితీశాయి. కాగా మార్చి నాటికి గ్రూప్-2 ఫలితాలు వెల్లడిస్తామని TGPSC తెలిపింది.
Similar News
News October 24, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ నటుడు లేనట్లేనా?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో <<18087082>>స్పిరిట్<<>> మూవీ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన సౌండ్ స్టోరీలో ప్రధాన పాత్రల్లో నటించే వారి వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తారని గతంలో ప్రచారం జరిగినా దీనిపై మూవీ యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా అప్డేట్లోనూ ఆయన పేరు లేకపోవడంతో, ఎలాగైనా లీని ప్రాజెక్టులోకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
News October 24, 2025
జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలుసా?

సుప్రీంకోర్టు తదుపరి <<18083662>>సీజేఐ<<>> రేసులో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 1962లో హరియాణాలోని హిసార్లో జన్మించారు. 1984లో లా డిగ్రీ అందుకున్న ఆయన 2000లో హరియాణా AGగా, 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్ప్రదేశ్ HC ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. ఒకవేళ ఆయన CJI నియమితులైతే నవంబర్ 24న బాధ్యతలు చేపట్టి 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు.
News October 24, 2025
ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.