News December 17, 2024
ముగిసిన గ్రూప్-2.. సగం మంది కూడా రాయలేదు!

TG: గ్రూప్-2 ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి. పేపర్-3 పరీక్షకు 45.62% మంది, పేపర్-4కు 45.57% మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం గమనార్హం. మొత్తం 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,51,486 మంది హాజరయ్యారు. పరీక్షలో చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన, పాత తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నలు చర్చకు దారితీశాయి. కాగా మార్చి నాటికి గ్రూప్-2 ఫలితాలు వెల్లడిస్తామని TGPSC తెలిపింది.
Similar News
News November 26, 2025
అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

TG: అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. కానీ మెదక్(D) వెల్దుర్తిలో అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. HYD జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్(32)కు 2022లో పూజతో వివాహమైంది. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని అత్తమామలు వేధిస్తున్నారు. ఈనెల 2న పెద్దల పంచాయితీలోనూ దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఈనెల 18న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామలపై కేసు నమోదైంది.
News November 26, 2025
పీరియడ్స్లో బ్లాక్ బ్లెడ్ వస్తోందా?

పీరియడ్స్లో కొందరిలో డార్క్ / బ్లాక్ బ్లడ్ డిశ్ఛార్జ్ కనబడుతుంది. అయితే దీనికి కారణం ఆహారం, జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భాశయం నుంచి వచ్చే పాత రక్తం కావొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్, టాంపోన్స్, కాపర్ టీ వల్ల కూడా ఇలా కనిపిస్తుంది. ఏదేమైనా పీరియడ్ బ్లడ్లో ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News November 26, 2025
నిరక్షరాస్యుల కోసం ‘అక్షరాంధ్ర’

APలో 15-59 ఏళ్ల వయసున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ ‘అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవడం, రాయడంతోపాటు కూడికలు, తీసివేతలను నేర్పిస్తారు. డిజిటల్, ఫైనాన్షియల్, హెల్త్, న్యాయ అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను ఇందుకు వినియోగిస్తారు. ప్రస్తుతం 81L మంది నిరక్షరాస్యులుండగా ఏటా 25L మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.


