News December 17, 2024
ముగిసిన గ్రూప్-2.. సగం మంది కూడా రాయలేదు!

TG: గ్రూప్-2 ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి. పేపర్-3 పరీక్షకు 45.62% మంది, పేపర్-4కు 45.57% మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం గమనార్హం. మొత్తం 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,51,486 మంది హాజరయ్యారు. పరీక్షలో చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన, పాత తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నలు చర్చకు దారితీశాయి. కాగా మార్చి నాటికి గ్రూప్-2 ఫలితాలు వెల్లడిస్తామని TGPSC తెలిపింది.
Similar News
News April 16, 2026
వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.
News April 16, 2026
27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

శాశ్వత ప్రాతిపదికన 27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్ & సింధ్ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.64,820-93,960గా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5-5-26. పూర్తి వివరాలకు www.punjabandsind.bank.in చూడండి.
News April 16, 2026
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్కు చెందిన లోన్ అకౌంట్లను బ్యాంకులు ఫ్రాడ్గా పేర్కొని దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ వేసిన పిటిషన్ను SC కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. తొలుత బాంబే HC సింగిల్ బెంచ్ అంబానీకి ఫేవర్గా తీర్పునిచ్చింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్ దీనిని పక్కన పెట్టింది.


