News November 14, 2024
గ్రూప్-4 రిజల్ట్స్ ఇవ్వాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్

TG: గ్రూప్-4లో అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు విడుదల చేయొద్దని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా మరికొందరు వెంటనే రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే ఫలితాలు ఆలస్యం అవుతాయని, అది కోరేవారు కొంతమందే ఉన్నారని చెబుతున్నారు. రెండేళ్లుగా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఫలితాలు ఇవ్వాల్సిందేనని TGPSCని కోరుతున్నారు.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


