News March 9, 2025
త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.
Similar News
News February 6, 2026
FLASH: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,360 పెరిగి రూ.1,53,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 ఎగబాకి రూ.1,40,900 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 6, 2026
ప్రేమ-పాశం: తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి..?

ఈ మధ్య భార్యలు/ వారి ప్రియుళ్ల చేతిలో భర్తల చావు ఘటనలు చాలా వింటున్నాం. వీటిలో తప్పు.. పెళ్లి తర్వాతా గత రిలేషన్లో ఉండే అమ్మాయిలదా? లవ్ మ్యాటర్ చెప్పినా బలవంతంగా మరొకరితో వివాహం చేస్తున్న పెద్దలదా? ప్రేమ పెళ్లితో పరువు పోతుందనే పేరెంట్స్.. మన అమ్మాయి వల్లే అల్లుడు చనిపోతే పరువు పోదా? ఇక Love Birds.. ప్రేమ తప్పదంటే త్యాగాన్నైనా కోరుతుంది. అది ప్రాణత్యాగం మాత్రం కాదు.. అవతలి ప్రాణం అస్సలే కాదు.
News February 6, 2026
యుద్ధ భయాలు: ఇరాన్ను వీడాలని తమ పౌరులకు US హెచ్చరిక

ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని US వర్చువల్ ఎంబసీ ఆదేశించింది. భూమార్గంలో పొరుగున ఉన్న అర్మేనియా, టర్కీకైనా వెళ్లాలని సూచించింది. కుదరకపోతే సరిపడా ఫుడ్, వాటర్తో అక్కడే సేఫ్ ప్లేస్లో తలదాచుకోవాలని తెలిపింది. ఇంటర్నెట్లో అంతరాయం ఉండొచ్చని, లోకల్ న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వాలని సూచించింది. అణుఒప్పందం కుదరని పక్షంలో ఏమైనా జరగొచ్చని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.


