News March 9, 2025

త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

image

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్‌లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.

Similar News

News March 19, 2025

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

image

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. మెరిట్ జాబితాను <>https://www.tspsc.gov.in/<<>> వెబ్‌సైట్‌లో ఉంచింది. సర్టిఫికేట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. 181 పోస్టులకు 16,729 మంది పరీక్ష రాసిన విషయం తెలిసిందే.

News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

News March 19, 2025

పోసాని బెయిల్ పిటిషన్.. 21న తీర్పు

image

AP: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి ఈ నెల 21కి తీర్పును వాయిదా వేశారు. ఈ కేసులో గుంటూరు జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. సీఐడీ కేసులోనూ బెయిల్ వస్తే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!