News December 28, 2024
ప్రధాని మోదీని కలిసిన గుకేశ్
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా గుకేశ్కు మోదీ చెస్ బోర్డు కానుకగా అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ప్రధాని మోదీని కలవడం నా జీవితంలోనే అత్యుత్తమమైన క్షణం’ అని గుకేశ్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తలైవా రజినీకాంత్ను కూడా గుకేశ్ కలిసిన విషయం తెలిసిందే.
Similar News
News January 16, 2025
నా నిజాయితీని నిరూపించుకుంటా: KTR
TG: ACB, ED ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని కేటీఆర్ చెప్పారు. ఈడీ విచారణ తర్వాత మాట్లాడుతూ ‘ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెబుతా. విచారణకు సహకరిస్తా. రాజ్యాంగాన్ని, కోర్టులను గౌరవించే వ్యక్తిగా నా నిజాయితీని నిరూపించుకుంటా అని వారితో చెప్పా. అయితే విచారణకు ₹5-10 కోట్లు ఖర్చు పెట్టడం బాధగా ఉంది. ఈ మొత్తంతో 2,500 మందికి పెన్షన్లు, 500 మందికి రుణమాఫీ చేయొచ్చు’ అని చెప్పారు.
News January 16, 2025
సైఫ్ను రూ.కోటి డిమాండ్ చేసిన దుండగుడు!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
News January 16, 2025
ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అటు సుమారు 7 గంటలపాటు కేటీఆర్ను అధికారులు విచారించారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు రూ.45 కోట్లు చెల్లించడంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించారు.