News January 2, 2025

మాంటినెగ్రోలో దుండగుడి కాల్పులు.. 10మంది మృతి

image

అమెరికాలో ఉగ్రవాది ట్రక్కుతో ఢీ కొట్టి కాల్పులు జరిపిన ఘటన మరువక ముందే ఈసారి ఐరోపాలో తుపాకీ గర్జించింది. మాంటినెగ్రోలో ఓ సాయుధ దుండగుడు కాల్పులకు తెగబడి 10మందిని హత్య చేశాడు. వారిలో అతడి కుటుంబీకులు కూడా ఉండటం గమనార్హం. నిందితుడిని కో మార్టినోవిక్(45)గా గుర్తించామని, అతడి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. బార్‌లో చోటుచేసుకున్న ఘర్షణ కాల్పులకు దారి తీసిందని వెల్లడించారు.

Similar News

News January 19, 2025

గజగజ.. 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కనిష్ఠంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24/25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 19, 2025

kg చికెన్ ధర ఎంతో తెలుసా?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.220-230గా ఉంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ.240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ.117గా కొనసాగుతోంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ.70గా ఉంది.

News January 19, 2025

WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్‌ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.