News February 9, 2025
పరువు తీసిందనే పగతో భార్యను చంపిన గురుమూర్తి!

TG: పంచాయితీ పెట్టి పరువు తీసిందనే కోపంతోనే గురుమూర్తి తన భార్యను హతమార్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. ఎలాగైనా భార్య అడ్డు తొలగించుకోవాలని JAN 15న పిల్లలను చెల్లెలి ఇంటి దగ్గర వదిలాడు. 16న భార్య గొంతు నులిమి చంపి, డెడ్ బాడీని ముక్కలుగా చేసి హీటర్తో ఉడికించాడు. మిగిలిన ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో పడేశాడు. గురుమూర్తికి అతడి చెల్లెలు, తల్లి, తమ్ముడు సహకరించినట్లు తెలుస్తోంది.
Similar News
News November 23, 2025
ఆహా.. ఓహో! అంతా అరచేతిలో స్వర్గమేనా?

AP: ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ అంటే పోటీ ప్రకటనలు, ప్రదర్శనల వేదికలుగా మారుతున్నాయా? జగన్ CMగా ఉండగా 340 కంపెనీలు ₹13 లక్షల కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపాయని నాటి ప్రభుత్వం చెప్పింది. ఇక 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా 625 కంపెనీలు ₹13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్కు ఇంట్రస్ట్ చూపాయని CBN తాజా ప్రభుత్వ స్టేట్మెంట్. వాస్తవ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలు ప్రకటనలకు దగ్గరగా ఉన్నాయా? అంటే ఆన్సర్ మీకు తెలుసుగా!
News November 23, 2025
రూ.485కే 72 రోజుల ప్లాన్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 రేంజ్లో ఉన్నాయి.
News November 23, 2025
TG న్యూస్ అప్డేట్స్

* ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం. ఈ భయంతోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల భూస్కామ్ అంటున్న కేటీఆర్ అందుకు ఆధారాలుంటే బయటపెట్టాలి: మంత్రి అడ్లూరి
* డీసీసీ పదవుల నియామకంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. 17 పదవులను బీసీలకే ఇచ్చాం. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుంది: మహేశ్ కుమార్ గౌడ్


