News February 9, 2025
పరువు తీసిందనే పగతో భార్యను చంపిన గురుమూర్తి!

TG: పంచాయితీ పెట్టి పరువు తీసిందనే కోపంతోనే గురుమూర్తి తన భార్యను హతమార్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. ఎలాగైనా భార్య అడ్డు తొలగించుకోవాలని JAN 15న పిల్లలను చెల్లెలి ఇంటి దగ్గర వదిలాడు. 16న భార్య గొంతు నులిమి చంపి, డెడ్ బాడీని ముక్కలుగా చేసి హీటర్తో ఉడికించాడు. మిగిలిన ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో పడేశాడు. గురుమూర్తికి అతడి చెల్లెలు, తల్లి, తమ్ముడు సహకరించినట్లు తెలుస్తోంది.
Similar News
News April 15, 2026
మహిళా బిల్లుకే మా మద్దతు.. డీలిమిటేషన్కు లేదు: ఖర్గే

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని.. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
News April 15, 2026
పెద్ది సినిమా రిలీజ్ మరోసారి వాయిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ పలు కారణాలతో జూన్ నెలకు పోస్ట్పోన్ అయింది.
News April 15, 2026
IPL చరిత్రలో అదిరిపోయే మ్యాచ్.. గుర్తుందా?

ఏడాది కిందట ఇదే రోజు IPLలో అరుదైన రికార్డ్ నమోదైంది. KKR, PBKS మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. తొలుత పంజాబ్ 111 పరుగులే చేసింది. దీంతో డికాక్, నరైన్, రింకూ, రస్సెల్ తదితరులతో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న KKR ఈజీగా గెలుస్తుందని భావించారు. కానీ PBKS అద్భుతం చేసింది. చాహల్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీయడంతో 95 రన్స్కే ఆలౌటైంది. IPL చరిత్రలో ఇదే లోయెస్ట్ స్కోర్ డిఫెండింగ్ మ్యాచ్ కావడం విశేషం.


