News September 25, 2024
హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడిగింపు
AP: హజ్ యాత్రకు దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,937 మంది యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
Similar News
News September 25, 2024
దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ
TG: దసరాలోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 6 ఖాళీల్లో ఇప్పటికే నలుగురి పేర్లు ఖరారయ్యాయని, మరో 2 పేర్లు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వేర్వేరు పేర్లు ప్రతిపాదించడంతోనే ఈ రెండు బెర్తులు పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. కశ్మీర్, హరియాణా ఎన్నికలు ముగిశాక AICC నేతలతో రేవంత్ చర్చలు జరిపి క్యాబినెట్ జాబితా సిద్ధం చేస్తారని సమాచారం.
News September 25, 2024
ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
AP: ఇటీవల వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నా, నాశనమైనా డూప్లికెట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని సూచించింది.
News September 25, 2024
ఇవాళ భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, MDK, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయంది. అటు APలోని KKD, కోనసీమ, తూ.గో., ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.