News September 25, 2024

హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: హజ్ యాత్రకు దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,937 మంది యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

Similar News

News November 13, 2025

TG TET షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News November 13, 2025

పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

image

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.

News November 13, 2025

బిహార్‌లో SIRపై ఒక్క అప్పీల్ కూడా రాలేదు: EC

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 67.13% పోలింగ్ నమోదైనట్లు EC అధికారికంగా ప్రకటించింది. 1951 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది. 38 జిల్లాల్లో ఎక్కడా రీపోల్ కోసం అప్పీల్స్ రాలేదని తెలిపింది. 7,45,26,858 మంది ఓటర్లతో తుది జాబితా రిలీజ్ చేశామని, ఎక్కడా SIRపై అప్పీల్ చేయలేదని వెల్లడించింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని చెప్పింది. ఇందుకోసం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.