News July 1, 2024
విదేశీ మ్యూజిక్ విన్నాడని పబ్లిక్లో ఉరి?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719798507781-normal-WIFI.webp)
దేశంలో నిషేధిత సౌత్ కొరియన్ సాంగ్స్ విన్నాడని 22ఏళ్ల యువకుడిని నార్త్ కొరియా ప్రభుత్వం పబ్లిక్లో ఊరి తీసిందట. దేశం విడిచి వెళ్లిన 649మంది సాక్ష్యాలతో నా.కొరియా మానవ హక్కుల సంఘం ఓ నివేదిక విడుదల చేసింది. 60 సౌత్ కొరియన్ సాంగ్స్ వినటంతో పాటు 3సినిమాలు చూశాడని హ్వాంగ్హే ప్రావిన్స్లోని వ్యక్తిని 2022లో పబ్లిక్గా ఉరి తీసినట్లు నివేదిక వెల్లడించింది. ఉరి వార్తలను నా.కొరియా కొట్టిపారేసింది.
Similar News
News July 3, 2024
మహేశ్ మూవీలో విలన్గా మలయాళ హీరో?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719977771506-normal-WIFI.webp)
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
News July 3, 2024
విద్యార్థులకు గుడ్న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718229788795-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్టాప్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్టాప్లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
News July 3, 2024
ఫొటో తీసి రూ.20వేలు గెలిచే ఛాన్స్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719964837320-normal-WIFI.webp)
AUG19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉత్తమ వార్తా చిత్రం(న్యూస్ క్లిప్) విభాగాల్లో ఫొటోలు తీయాలి. మొదటి ముగ్గురికి రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, తర్వాత ఐదుగురికి ప్రోత్సాహకంగా రూ.5వేలు ఇస్తుంది. ఫొటోలను adphoto.ts@gmail.coకి పంపాలి. మరిన్ని వివరాలకు 9949351523కి ఫోన్ చేయవచ్చు.