News January 11, 2025
పండగ హ్యాపీగా జరుపుకోండి ఫ్రెండ్స్!

చదువు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం HYDలో స్థిరపడ్డ లక్షలాది మంది సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో చాలా మంది కార్లు, బైకులపై వెళ్తున్నారు. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట జర్నీ చేయవద్దు. 80 కి.మీ వేగం దాటొద్దు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొద్దు. కచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనం నడపకూడదు.
*క్షేమంగా వెళ్లి లాభంగా రండి.
Similar News
News November 26, 2025
అమరావతి: సీఆర్డీఏ అధికారులారా.. ఇదేం తీరు?

అమరావతి అసైన్డ్ రైతులకు సంబంధించి ఇటీవల కూటమి సర్కార్ అసైన్డ్ అనే పదం తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం GO అమలు కావడంలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే 90% మంది రైతులు ప్లాట్లు అమ్ముకోగా.. మిగిలిన 10% రైతులకి కూడా వర్తింపజేయకుండా CRDA అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసైన్డ్ అనే పదం తొలగిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, కానీ తమకు నిరాశే మిగిలిందంటున్నారు.
News November 26, 2025
వేరుశనగ పంటకు నీటిని ఏ సమయంలో అందించాలి?

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.
News November 26, 2025
750పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ఈనెల 23తో గడువు ముగియగా.. DEC 1వరకు పొడిగించారు. డిగ్రీ ఉత్తీర్ణులైన 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు.


