News January 11, 2025

పండగ హ్యాపీగా జరుపుకోండి ఫ్రెండ్స్!

image

చదువు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం HYDలో స్థిరపడ్డ లక్షలాది మంది సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో చాలా మంది కార్లు, బైకులపై వెళ్తున్నారు. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట జర్నీ చేయవద్దు. 80 కి.మీ వేగం దాటొద్దు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొద్దు. కచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనం నడపకూడదు.
*క్షేమంగా వెళ్లి లాభంగా రండి.

Similar News

News November 9, 2025

ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్‌ల‌కు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

News November 9, 2025

చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

image

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.

News November 9, 2025

భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

image

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్‌లో భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.