News March 25, 2024
మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్లు

TG: సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ట్యాపింగ్ హార్డ్ డిస్క్లను మూసీలో పడేసినట్లు నిందితుడు ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నాగోలు మూసీ వంతెన కింద వాటిని స్వాధీనం చేసుకుని FSLకు పంపించారు. ఈ కేసులో పోలీసులు ఏ-1గా ప్రణీత్ రావు, ఏ-2గా భుజంగరావు, ఏ-3గా తిరుపతన్నను చేర్చారు. ఇప్పటికే వారు నేరాన్ని అంగీకరించారు.
Similar News
News December 15, 2025
దేశానికి త్వరలో కొత్త ప్రధాని: పృథ్వీరాజ్

మహారాష్ట్ర మాజీ సీఎం, INC నేత పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి త్వరలో కొత్త PM రాబోతున్నారని జోస్యం చెప్పారు. ఆయన మరాఠీ వ్యక్తే కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల SMలో తాను చేసిన పోస్టుపై స్పందిస్తూ ‘ప్రపంచ స్థాయిలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మార్పులు జరగొచ్చు. బీజేపీ మహారాష్ట్ర నుంచి కొత్త వ్యక్తికి ప్రధానిగా అవకాశం ఇవ్వొచ్చు. నా ప్రకటన ఊహాజనితమే’ అని పేర్కొన్నారు.
News December 15, 2025
24 ఏళ్ల వయసులో రూ.2.50 కోట్ల టర్నోవర్

ఒక స్టార్టప్తో 10 వేల మంది రైతులకు అండగా నిలుస్తున్నారు బిహార్కు చెందిన 24 ఏళ్ల ప్రిన్స్ శుక్లా. రైతుల కష్టాలను చూసి చలించిన అతడు తండ్రి నుంచి రూ.లక్ష తీసుకొని ‘AGRATE’ సంస్థ స్థాపించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్, ఎరువులు, ఆధునిక శిక్షణ ఇస్తూ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించడంతో వారి ఆదాయం పెరిగింది. ప్రస్తుతం AGRATE టర్నోవర్ రూ.2.5 కోట్లు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 97

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>


