News March 25, 2024

మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్‌లు

image

TG: సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ట్యాపింగ్ హార్డ్ డిస్క్‌లను మూసీలో పడేసినట్లు నిందితుడు ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నాగోలు మూసీ వంతెన కింద వాటిని స్వాధీనం చేసుకుని FSLకు పంపించారు. ఈ కేసులో పోలీసులు ఏ-1గా ప్రణీత్ రావు, ఏ-2గా భుజంగరావు, ఏ-3గా తిరుపతన్నను చేర్చారు. ఇప్పటికే వారు నేరాన్ని అంగీకరించారు.

Similar News

News April 12, 2026

చర్చలు విఫలం.. ఏం జరగబోతోంది?

image

అమెరికా-ఇరాన్ చర్చలు <<19629050>>విఫలం<<>> కావడంతో 14 రోజుల సీజ్‌ఫైర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్, విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను ధ్వంసం చేయవచ్చు. అటు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీ ప్లాంట్లను టార్గెట్ చేసుకొని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయవచ్చు.

News April 12, 2026

ప్రచారంలో బ్రేక్.. IPL చూసిన సీఎం

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం స్టాలిన్ కాసేపు రిలాక్స్ అయ్యారు. కారులో వెళ్తూ ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన IPL మ్యాచ్ వీక్షించారు. ‘హై ఓల్టేజ్ ప్రచారంలో IPL బ్రేక్. సంజూ శాంసన్ సెంచరీ చేసినప్పటికీ.. నా అభిమాన క్రికెటర్ ధోనీని మిస్ అవుతున్న భావన పోవడం లేదు’ అని ట్వీట్ చేశారు. మ్యాచ్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. తమిళనాడులో ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.

News April 12, 2026

త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ధురంధర్-2 నటుడు?

image

ధురంధర్-2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ స్నేహితుడిగా కనిపించిన ఉదయ్ వీర్ సంధును టాలీవుడ్‌కు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే47’లో విలన్ పాత్రకు సంధును ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ధురంధర్-2లో సంధు కొద్దిసేపే కనిపించినా నటనతో ఆకట్టుకున్నారు. ఆయన అంతకుముందు అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ మూవీలో కనిపించారు.