News March 28, 2025
కార్యకర్తలకు హ్యాట్సాఫ్: YS జగన్

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో CBN అధికార అహంకారాన్ని బేఖాతరు చేస్తూ MPTCలు, ZPTCలు YCP అభ్యర్థులను గెలిపించుకున్నారని YS జగన్ కొనియాడారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టిన వారిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో వారు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. పార్టీకి ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు.
Similar News
News April 20, 2025
అగ్నివీర్ ఎయిర్ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

అగ్నివీర్ ఎయిర్ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <
వెబ్సైట్:https://agnipathvayu.cdac.in/
News April 20, 2025
హసీనా అరెస్టుకు ఇంటర్పోల్ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్పోల్ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
News April 20, 2025
ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్తో మనల్ని ప్రెజర్లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.