News January 23, 2025
రూ.173కు కొని.. రూ.43 కోట్లకు అమ్మాడు!

ఇంట్లో పాత వస్తువులుంటే మనం చెత్తబుట్టలో పడేస్తాం. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆ పాత వస్తువు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. పాత వస్తువులను కలెక్ట్ చేసే అలవాటున్న ఓ వ్యక్తి 2010లో ఓ షాపుకెళ్లి $2 (రూ. 173) చెల్లించి పాత ఫొటోను కొన్నాడు. అయితే, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అమెరికన్ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందినవారని తెలుసుకున్నాడు. ఈక్రమంలో 2014లో దీనిని వేలం వేసి $5 మిలియన్లకు(రూ.43కోట్లు) విక్రయించాడు.
Similar News
News February 20, 2025
Beautiful Photo: రోహిత్ ఖుషీ.. టీమ్ జోష్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు బంగ్లాతో తలపడేందుకు భారత జట్టు నేడు ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించింది. ఫుట్బాల్ ఆడుతున్న సమయంలో జట్టు ఆటగాళ్లంతా రోహిత్ చుట్టూ చేరి నవ్వుతూ కనిపించారు. రోహిత్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టు సభ్యులు హిట్మ్యాన్పై చూపే ప్రేమ, ఆప్యాయతకు ఇది నిదర్శమని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.
News February 20, 2025
రాత్రిపూట వీటిని తింటున్నారా?

రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాల జోలికి పోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, సోడా, కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్స్ తినకూడదు. ఇవి తింటే సరిగ్గా నిద్రపట్టదు. స్వీట్లు, చాక్లెట్లు తినడం మంచిది కాదు. పరోటా, బంగాళదుంపల జోలికి వెళ్లొద్దు. డీప్ ఫ్రై, స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు, పచ్చి ఉల్లిపాయలు తింటే కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.
News February 19, 2025
TGలో త్వరలో ఉప ఎన్నికలు: బండి సంజయ్

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రస్తుతం వెంటిలేటర్పై ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. అందుకే రహస్య సమావేశాలు పెడుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 10 స్థానాల్లో 7 సీట్లు బీజేపీ గెలుస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.