News May 10, 2024

పోకీమాన్ కార్డ్స్ వేలం వేసి రూ.57 లక్షలు సంపాదించాడు!

image

వింటేజ్ పరికరాల ద్వారా ఎలాంటి లాభం లేనప్పటికీ కొందరు ఆసక్తితో సేకరిస్తారు. అయితే, యూకేకి చెందిన రిచర్డ్ వింటర్టన్ అనే వ్యక్తి 1990 నుంచి 2000 మధ్యలో సేకరించిన పోకీమాన్ కార్డ్స్ అతడిని మిలియనీర్‌ను చేశాయి. మొత్తం 2407 కార్డ్స్‌ను వేలంలో ఉంచగా.. జపాన్, చైనా, అమెరికా నుంచి బిడ్డర్స్ ఆసక్తి చూపారు. మొత్తం 21 మంది ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొని 55వేల పౌండ్స్ (రూ.57 లక్షలు)కు వీటిని దక్కించుకున్నారు.

Similar News

News February 19, 2025

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

పీఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది. ఏటా రూ.6000 3 విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఈ నెల 24లోపు E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఇక్కడ <>క్లిక్ <<>>చేసి జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయండి.

News February 19, 2025

జగన్‌కు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి పెమ్మసాని

image

AP: వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఆ 11 సీట్లు కూడా రావని, ఒక్క సీటుకే పరిమితమవుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘జగన్ భాష, వ్యవహారంతో వైసీపీకి కష్టాలు తప్పవు. ఆయన హయాంలో YCP నేతలతో చేయకూడని పనులు చేయించారు. వాటిపైనే ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సీఎం చంద్రబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News February 19, 2025

కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.

error: Content is protected !!