News March 2, 2025

టీ తాగేందుకు రైలు దిగాడు.. కానీ 20 ఏళ్లుగా..!

image

AP: టీ తాగేందుకు రైలుదిగి 20 ఏళ్లపాటు వెట్టిచాకిరీలో మగ్గిపోయిన ఓ వ్యక్తి దీనగాథ ఇది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పారావు 2005లో పుదుచ్చేరి వెళ్తూ TNలోని ఓ రైల్వే స్టేషన్‌లో టీ తాగుదామని దిగాడు. మళ్లీ ఎక్కేలోపే ఆ రైలు వెళ్లిపోయింది. చేతిలో డబ్బుల్లేక అటు ఇటు తిరుగుతూ కలైయార్కోయిల్ ప్రాంతానికి చేరుకున్నాడు. అన్నాదురై అనే వ్యక్తికి చెందిన గొర్రెలను ఒక్క రూపాయి జీతం లేకుండా మేపి వెట్టిచాకిరీ చేశాడు.

Similar News

News December 16, 2025

పుణ్యాన్నిచ్చే రెండు పవిత్ర మంత్రాలు…

image

1. “ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః”
2. “ఓం శ్రీ రంగ నిలయాయై నమః”
ఈ పవిత్ర ధనుర్మాసంలో ప్రతిరోజు ఈ రెండు మంత్రాలను పఠించాలని పండితులు సూచిస్తున్నారు. శ్రీవ్రతం ఆచిరించే వారితో పాటు, పూజ చేయనివారు కూడా పఠించవచ్చని చెబుతున్నారు. పూజా మందిరంలో కొలువైన విష్ణుమూర్తి ఏ రూపాన్నైనా చూస్తూ పఠిస్తే.. సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. ఇంట్లో మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.

News December 16, 2025

APPLY NOW: పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

పవన్ హాన్స్ లిమిటెడ్‌ 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణులు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.2,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.pawanhans.co.in/

News December 16, 2025

నేడు వర్షాలు!

image

AP: రాయలసీమ జిల్లాలను మళ్లీ వర్షాలు పలకరించనున్నాయి. బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీస్తుండటంతో తమిళనాడును ఆనుకొని ఉన్న రాయలసీమలో ఇవాళ అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. నిన్న అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు(M) కిలగాడలో 7.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో COMMENT చేయండి.