News September 25, 2024
ఒకే ఇన్నింగ్స్లో 86 ఫోర్లు కొట్టాడు

గుజరాత్ గాంధీనగర్లో జరిగిన U-18 టోర్నీలో ద్రోణా దేశాయ్ రికార్డు సృష్టించాడు. 320 బంతుల్లో 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 రన్స్ చేశాడు. అయితే 500 మార్క్ చేరుకోలేకపోవడం బాధించిందన్నాడు. గ్రౌండ్లో స్కోర్ బోర్డు లేకపోవడం, సహచరులు సైతం ఆ విషయం చెప్పలేదని తెలిపాడు. దీంతో స్ట్రోక్ ఆడేందుకు వెళ్లి ఔట్ అయినట్లు చెప్పాడు. ఇంత భారీ స్కోర్ సాధించిన వారి జాబితాలో దేశంలోనే దేశాయ్ 6వ స్థానంలో నిలిచాడు.
Similar News
News September 19, 2025
ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
News September 19, 2025
నేటి అసెంబ్లీ అప్డేట్స్

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టనున్నారు.
News September 19, 2025
23 రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (<