News March 19, 2024

పది పరీక్ష రాసి వచ్చేసరికి అమ్మను కోల్పోయాడు!

image

ఓ వైపు తల్లికి అనారోగ్యం.. మరోవైపు టెన్త్ పరీక్ష. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పరీక్ష రాయాలని కొత్తగూడెంకు చెందిన మహేశ్ నిర్ణయించుకున్నారు. అయితే, పరీక్ష బాగా రాసానమ్మా అని చెప్పాలని తిరిగి వచ్చిన అతడికి కన్నీరే మిగిలింది. అప్పటికే అతడి తల్లి చనిపోయింది. ఇలానే.. ఖమ్మంలో అఖిల్, సూర్యాపేటలో మౌనిక, కామారెడ్డిలో స్రవంతి, SRCLలో శ్రవణ్, MHBNRలో అజయ్ తల్లిదండ్రులను కోల్పోయినా.. పది పరీక్షకు హాజరయ్యారు.

Similar News

News July 8, 2025

శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

image

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.

News July 8, 2025

పవన్ కళ్యాణ్ ఆగ్రహం

image

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.

News July 8, 2025

వామ్మో రష్మిక.. గుర్తు పట్టారా!(PHOTO)

image

‘మైసా’లో లుక్‌తో ప్రేక్షకులను భయపెట్టిన హీరోయిన్ రష్మిక మరో లుక్ వైరలవుతోంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటో షూట్‌లో వెస్టర్న్ లుక్‌లో ఆమె గుర్తు పట్టకుండా మారిపోయారు. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో కొత్త లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. మరి నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.