News March 19, 2024

పది పరీక్ష రాసి వచ్చేసరికి అమ్మను కోల్పోయాడు!

image

ఓ వైపు తల్లికి అనారోగ్యం.. మరోవైపు టెన్త్ పరీక్ష. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పరీక్ష రాయాలని కొత్తగూడెంకు చెందిన మహేశ్ నిర్ణయించుకున్నారు. అయితే, పరీక్ష బాగా రాసానమ్మా అని చెప్పాలని తిరిగి వచ్చిన అతడికి కన్నీరే మిగిలింది. అప్పటికే అతడి తల్లి చనిపోయింది. ఇలానే.. ఖమ్మంలో అఖిల్, సూర్యాపేటలో మౌనిక, కామారెడ్డిలో స్రవంతి, SRCLలో శ్రవణ్, MHBNRలో అజయ్ తల్లిదండ్రులను కోల్పోయినా.. పది పరీక్షకు హాజరయ్యారు.

Similar News

News January 18, 2026

నేటి నుంచి నాగోబా జాతర

image

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.

News January 18, 2026

దానిమ్మలో ‘భగవా’ రకం ప్రత్యేకం

image

దానిమ్మలో చీడపీడల బెడద ఎక్కువ. అందుకే ఈ పంటను చాలా జాగ్రత్తగా సాగు చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన భగవా దానిమ్మ రకం ప్రత్యేకమైనది. కాయ సైజు పెద్దగా ఆకర్షణీయమైన కుంకుమ రంగులో ఉండటంతో పాటు రుచి చాలా తియ్యగా ఉంటుంది. దీనిపైన తొక్క కూడా మందంగా ఉంటుంది. ఇతర రకాలతో పోలిస్తే భగవా రకం పండ్లు చీడపీడలు, తెగుళ్లను తట్టుకొని మచ్చలకు తక్కువగా గురవుతాయి. మార్కెట్‌లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది.

News January 18, 2026

నేషనల్ టెస్ట్ హౌస్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>నేషనల్ టెస్ట్ హౌస్‌<<>>లో 25 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్& న్యూట్రీషన్, డెయిరీ టెక్నాలజీ), MBA, PG మాస్ కమ్యూనికేషన్, BE/ B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Sr.యంగ్ ప్రొఫెషనల్‌కు నెలకు రూ.70k, Jr.యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.40k చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nth.gov.in