News May 12, 2024

తన రికార్డును తానే తిరగరాశాడు

image

ఎవరెస్టు శిఖరాన్ని అత్యధిక సార్లు(28) అధిరోహించిన వ్యక్తిగా నిలిచిన కమీ రీటా తన రికార్డును తానే బ్రేక్ చేశారు. తాజాగా 29వ సారి ఎవరెస్టును అధిరోహించారు. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్‌కు చెందిన ఈయన తొలిసారిగా 1994, మే 13న ఎవరెస్టును ఎక్కారు. అలాగే ఇప్పటివరకు చోయు శిఖరాన్ని 8 సార్లు, మనస్లూను 3 సార్లు, లోట్సే, K2 రెండింటినీ ఒక్కోసారి అధిరోహించారు.

Similar News

News November 18, 2025

కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.

News November 18, 2025

కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.

News November 18, 2025

బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెడుతున్నారు: మద్రాస్ హైకోర్టు

image

విఫలమైన ప్రతి బంధాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) వ్యాఖ్యానించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దేవా విజయ్(తిరునెల్వేలి) తనతో 9ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్నాడని, మోసం చేశాడని ఓ యువతి రేప్ కేసు పెట్టింది. దీనిపై విజయ్ కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు యువతిని మోసం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.