News May 12, 2024
తన రికార్డును తానే తిరగరాశాడు

ఎవరెస్టు శిఖరాన్ని అత్యధిక సార్లు(28) అధిరోహించిన వ్యక్తిగా నిలిచిన కమీ రీటా తన రికార్డును తానే బ్రేక్ చేశారు. తాజాగా 29వ సారి ఎవరెస్టును అధిరోహించారు. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్కు చెందిన ఈయన తొలిసారిగా 1994, మే 13న ఎవరెస్టును ఎక్కారు. అలాగే ఇప్పటివరకు చోయు శిఖరాన్ని 8 సార్లు, మనస్లూను 3 సార్లు, లోట్సే, K2 రెండింటినీ ఒక్కోసారి అధిరోహించారు.
Similar News
News December 11, 2025
చలికాలం.. పాడి పశువుల సంరక్షణ(2/2)

ఇప్పటి వరకు పశువులకు గాలికుంటు, గొంతువాపు, చిటుక వ్యాధుల టీకాలు వేయించకపోతే వెటర్నరీ డాక్టర్ సూచన మేరకు టీకాలు వేయించాలి. బాహ్య పరాన్న జీవుల నుంచి పశువులను, జీవాలను కాపాడటానికి పాకలను, షెడ్లను శుభ్రంగా ఉంచాలి. పశువుల విసర్జితాలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. షెడ్లలో నిమ్మ గడ్డి, తులసి, వావిలాకు కొమ్మలను కట్టలుగా కట్టి వేలాడదీస్తే వీటి నుంచి వచ్చే వాసనకు బాహ్యపరాన్న జీవులు షెడ్లలోకి రాకుండా ఉంటాయి.
News December 11, 2025
యాషెస్ మూడో టెస్టుకు కమిన్స్

ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాషెస్ సిరీస్ 3వ టెస్టుకు అందుబాటులోకి వచ్చారు. జులైలో WIతో జరిగిన టెస్ట్ సిరీస్లో వెన్నునొప్పికి గురైన అతను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. స్పిన్నర్ నాథన్ లయన్ కూడా ఈ టెస్టులో బరిలో దిగే ఛాన్సుంది. కమిన్స్ గైర్హాజరుతో తొలి 2 టెస్టులకు స్మిత్ కెప్టెన్గా వ్యవహరించగా, రెండిట్లోనూ ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ నెల 17న అడిలైడ్లో మూడో టెస్ట్ జరగనుంది.
News December 11, 2025
రాష్ట్రంలో 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<


