News September 30, 2024

మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదు: వెంకయ్య

image

AP: తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదని చెప్పారు. ఛత్రపతి, లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి వాళ్లు మాతృభాష మాట్లాడే గొప్పవాళ్లు అయ్యారని తెలిపారు. ANUలో నిర్వహించిన తత్వవేత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Similar News

News January 5, 2026

అసెంబ్లీ వేదికగా BRSపై కవిత విమర్శల దాడి

image

TG: శాసనమండలి వేదికగా BRSపై కవిత విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి తన బహిష్కరణ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వలేదన్నారు. సస్పెన్షన్‌కు ముందు వివరణ కూడా తీసుకోలేదని మండిపడ్డారు. పార్టీలో లేని ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నైతికత లేని పార్టీలో ఉండలేకే బయటికి వచ్చానని, పదవి కూడా వద్దనుకొని రాజీనామా చేశానన్నారు. దాన్ని ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు.

News January 5, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. TG సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. హరీశ్ ఆదేశాలతో రాధాకిషన్ ఫోన్ ట్యాప్ చేశారని 2024 DECలో FIR నమోదైంది. దీనిపై హరీశ్ కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం FIRను కొట్టివేసింది. ఇప్పుడు SCలోనూ ఆయనకు ఊరట దక్కింది. HC, SCలో ఎదురుదెబ్బ తగలడంతో ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

News January 5, 2026

బెండలో కాయ తొలుచు పురుగు నివారణ ఎలా?

image

బెండ మొక్క పెరుగుదల దశలో కాయ తొలిచే పురుగు మొక్క మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచి తొలగించాలి. వీటి నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్‌ నీటిలో 3గ్రా. కార్బరిల్‌ (లేదా) 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.