News March 31, 2024

జస్ట్ 1.8 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు: కేసీఆర్

image

TG: అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా రుణ మాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది. సీఎం రేవంత్ ఎక్కడ పడుకున్నారు. జనాలకు ఇష్టమొచ్చిన సొల్లు పురాణాలు చెప్పి జస్ట్ 1.8శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని నిద్రపోనివ్వం. తరిమి కొడతాం’ అని హెచ్చరించారు.

Similar News

News October 6, 2024

అభిమాని కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు

image

AP: క్యాన్సర్ ఫైనల్ స్టేజీలో ఉన్న ఓ అభిమాని ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారు. రేణిగుంటకు చెందిన దివ్యాంగుడు సురేంద్రబాబు(30) క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఒక్కసారైనా చంద్రబాబుతో ఫొటో దిగాలనే కోరికను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో తిరుమల పర్యటన ముగించుకుని రేణిగుంటకు వచ్చిన CM దగ్గరకు సురేంద్రను తీసుకెళ్లారు. CM అతనితో ఫొటో దిగి రూ.5 లక్షల చెక్కును అందించారు.

News October 6, 2024

World Bankకు సలహాలిచ్చే స్థాయికి భారత్: ఫేమస్ ఎకానమిస్ట్

image

సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇచ్చే స్థితికి భారత్ చేరిందని ఎకానమిస్ట్ జగదీశ్ భగవతి అన్నారు. ‘మనమిప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైమ్‌లో మోదీ PM కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే చెప్తున్నారు. కేంబ్రిడ్జ్ సహా మేధావులకు లేని కన్విక్షన్ ఆయన సొంతం. అందుకే ఆయనిష్టం’ అని చెప్పారు.

News October 6, 2024

JK: పాక్ ఆయుధాలు, బాంబుల్ని సీజ్ చేసిన ఆర్మీ

image

JK పూంఛ్ జిల్లాలోని జుల్లాస్ ఏరియాలో డేంజరస్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. నమ్మదగిన వారి సమాచారంతో భారత సైన్యం రోమియోఫోర్స్ శనివారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది. అనుమానిత టెర్రరిస్టు బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఇందులో AK 47, పాకిస్థానీ పిస్టల్, RCIED, టైమ్ బాంబులు, స్టవ్ IED, IED పరికరాలు, చైనీస్ గ్రెనేడ్లు ఉన్నాయి. ఇవన్నీ రెడీ టు యూజ్ మోడ్‌లో ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.