News July 26, 2024
ఆ బాధ్యతలు రోహిత్కే అప్పగించేవాడిని: బుమ్రా

క్రికెట్లోకి వచ్చిన కొత్తలో తనకు పెద్దగా ఏమీ తెలియదని భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు. IPLలో ఆడటం ప్రారంభించాక రోహిత్ శర్మను ఫీల్డ్ సెట్ చేయమని చెప్పేవాడినని ఓ కార్యక్రమంలో తెలిపారు. తాను ఏ బాల్ వేస్తున్నానో చెప్పి అందుకు అనుగుణంగా హిట్ మ్యాన్ను ఫీల్డింగ్ సెట్ చేయమని అడిగేవాడినని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆటలో అనుభవం వచ్చాక ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
19 మృతదేహాలు వెలికితీత

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2025
భారీగా తగ్గిన వెండి ధరలు

వరుసగా నాలుగో రోజు కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై ధర రూ.3 వేలు తగ్గి రూ.1,71,000 వద్ద కొనసాగుతోంది. నాలుగు రోజుల్లోనే సిల్వర్ ధరలు కిలోకి రూ.19 వేలు తగ్గడం గమనార్హం. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.1,25,460 వద్ద కొనసాగుతోంది. 22K 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.1,15,000గా ఉంది.
News October 24, 2025
మద్దతు ధరపై పత్తి రైతుల్లో ఆందోళన

ఈ ఏడాది పత్తి పంట క్వింటాకు రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పంటలో తేమ, నాణ్యత ఉంటేనే ఈ ధర వస్తుంది. పత్తిలో గరిష్ఠంగా 8-12% తేమనే CCI అనుమతిస్తోంది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు, చీడపీడల వల్ల ఈసారి పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో పాటు నాణ్యత కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల మద్దతు ధర దక్కుతుందో? లేదో? అనే ఆందోళన పత్తి రైతుల్లో నెలకొంది.


