News May 10, 2024
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

BRS MLC కవిత బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆమె వాదనలు విన్న ధర్మాసనం.. కవిత బెయిల్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. ఈమేరకు తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.
Similar News
News February 13, 2025
కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్

TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రేపు మ.2 గంటలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.
News February 13, 2025
మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చిలో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె మార్చి మధ్యలో రానున్నట్లు NASA తెలిపింది. సునీతతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నట్లు పేర్కొంది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని వెల్లడించింది.
News February 13, 2025
నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు

AP: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్షలకు వచ్చే సమయంలో హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని APPSC స్పష్టం చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లలో 89,900 మంది పరీక్ష రాయనున్నారు.