News May 2, 2024

టీడీపీ పిటిషన్‌పై విచారణ సాయంత్రానికి వాయిదా

image

AP: స్వతంత్ర అభ్యర్థులకు జనసేన గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ దాఖలు చేసిన <<13162957>>పిటిషన్‌పై <<>>హైకోర్టు విచారించింది. జనసేనకు తప్ప రాష్ట్రంలో ఇంకెవరికీ ఈ గుర్తు కేటాయించవద్దని టీడీపీ కోరగా.. ఎన్నికల ప్రక్రియ ఏ దశలో ఉందో చెప్పాలని ఈసీని కోర్టు ఆదేశించింది. అటు తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

Similar News

News March 4, 2026

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?

image

జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, BC రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3నెలలు పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైనా, రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే ‘పంచాయతీ’ నిర్వహించాలనే వాదనా ఉంది.

News March 4, 2026

ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

image

చంద్రగ్రహణంతో ఈసారి హోలీ పండుగ ఎప్పుడనే గందరగోళం ఏర్పడింది. కొందరు నిన్నే రంగులు చల్లుకోగా.. AP, TG ప్రభుత్వాలూ స్కూళ్లకు మంగళవారమే సెలవు ఇచ్చాయి. అయితే గ్రహణం ఉండటంతో ఇవాళ(బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు తెలిపారు. కానీ స్కూళ్లకు నిన్నే పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో ఇవాళ సెలవు లేదు. పిల్లలు బడికి వెళ్లాల్సిందే. అటు చాలావరకు ప్రైవేటు కార్యాలయాలకు ఇవాళ సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీకూ ఉందా?

News March 4, 2026

దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

image

దేశంలో వైట్ కాలర్ జాబ్స్‌ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.