News December 1, 2024

భారీ ఎన్‌కౌంటర్.. మృతిచెందిన ఏడుగురు మావోలు వీరే

image

TG: ములుగు జిల్లా చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన <<14757563>>భారీ ఎన్‌కౌంటర్‌లో<<>> ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. వీరు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో బద్రు, మల్లయ్య, కరుణాకర్, జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్లలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్ అని సమాచారం.

Similar News

News April 1, 2026

IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

image

IPL-19 సీజన్‌లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.

News April 1, 2026

అమరావతి బిల్లుపై చర్చకు YCP

image

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.

News April 1, 2026

రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.