News December 1, 2024

భారీ ఎన్‌కౌంటర్.. మృతిచెందిన ఏడుగురు మావోలు వీరే

image

TG: ములుగు జిల్లా చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన <<14757563>>భారీ ఎన్‌కౌంటర్‌లో<<>> ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. వీరు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో బద్రు, మల్లయ్య, కరుణాకర్, జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్లలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్ అని సమాచారం.

Similar News

News January 4, 2026

రోజూ 6-7 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

image

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 6 నుంచి 7 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 నుంచి 6 కేజీల ఎండుగడ్డి, 3 నుంచి 3.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 15-20 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.

News January 4, 2026

ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

image

<>పుణే<<>>, బిబ్వేవాడిలోని ESIC హాస్పిటల్‌ 20 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MD/DNB/DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC,STలకు రూ.75. వెబ్‌సైట్: https://esic.gov.in/

News January 4, 2026

ఆరోగ్యానికి బాదం ఇచ్చే 6 అద్భుత ప్రయోజనాలు!

image

పోషకాల గని అయిన బాదం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తూ బరువు తగ్గడానికి సాయపడతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, చర్మం, జుట్టు మెరిసేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని విటమిన్లు, మినరల్స్ ఒంటికి బాగా పడతాయి.