News December 1, 2024

భారీ ఎన్‌కౌంటర్.. మృతిచెందిన ఏడుగురు మావోలు వీరే

image

TG: ములుగు జిల్లా చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన <<14757563>>భారీ ఎన్‌కౌంటర్‌లో<<>> ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. వీరు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో బద్రు, మల్లయ్య, కరుణాకర్, జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్లలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్ అని సమాచారం.

Similar News

News February 18, 2025

BREAKING: టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు డబ్బులు చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 18, 2025

Stock Markets: ఐటీ తప్ప అన్నీ…

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ 22,917 (-40), సెన్సెక్స్ 75,920 (-70) వద్ద చలిస్తున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పటికే ఓవర్‌సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో కౌంటర్ ర్యాలీకి అవకాశం ఉంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్.

News February 18, 2025

మహిళలు, BC, SC, STలకు శుభవార్త

image

AP: సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే మహిళలు, BC, SC, ST, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు GOVT శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్‌లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే SC, STలకు భూమి విలువలో 75% రాయితీ(గరిష్ఠంగా ₹25L) కల్పిస్తూ మరో GO ఇచ్చింది.

error: Content is protected !!