News August 2, 2024

ఇకపై గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్లు

image

TG: రాష్ట్రంలోని 10,954 గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ల(JRO)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ సేవలు అందించేందుకు VRO, VRAలు ఉండేవారు. గత సర్కార్ ఆ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఇప్పుడు వారినే కాంగ్రెస్ ప్రభుత్వం JROలుగా నియమించనుంది. దీనివల్ల ఆర్థిక భారం తప్పడంతో పాటు కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉండదు.

Similar News

News November 19, 2025

త్వరలో ఆధార్ కార్డులో కీలక మార్పులు!

image

ఆధార్ విషయంలో కీలక మార్పులు చేయాలని UIDAI భావిస్తోంది. ఫొటో, QR కోడ్‌తో ఆధార్ కార్డును తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తుల డేటా దుర్వినియోగం కాకుండా ఈ దిశగా ఆలోచిస్తోందని తెలిపాయి. కార్డుపై వివరాలు ఎందుకు ఉండాలని, ఫొటో, QR కోడ్ ఉండాలని UIDAI CEO భువనేశ్ కుమార్ అన్నారు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను నియంత్రించేలా డిసెంబర్‌లో కొత్త రూల్ తీసుకొస్తామని తెలిపారు.

News November 19, 2025

ఇలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదట

image

మాసిన బట్టలు ధరించి, పరిశుభ్రత పాటించనివారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే అమితంగా తినేవారి దగ్గర, బద్ధకంగా ఉండే వ్యక్తులు దగ్గర, కర్ణ కఠోరంగా మాట్లాడేవారి దగ్గర ధనం నిలవదని అంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పడుకునేవారు ఎంతటి గొప్పవారైనా వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని తెలుపుతున్నారు. ఒకవేళ వీరి వద్ద సంపద ఉన్నా, అది ఎక్కువ రోజులు నిలవదని పేర్కొంటున్నారు.

News November 19, 2025

భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

image

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్‌లో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.