News August 10, 2024

ఇకపై బ్యాంకులకే వడ్డీరేట్లపై నిర్ణయాధికారం

image

బ్యాంకు డిపాజిట్లు, రుణాల వడ్డీరేట్లపై నియంత్రణను తొలగిస్తున్నామని RBI గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఇకపై సొంతంగా వడ్డీరేట్లు నిర్ణయించుకోవచ్చని వెల్లడించారు. FM నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా బ్యాంకింగ్ నియంత్రణ సవరణ చట్టం తీసుకొచ్చేందుకు చాన్నాళ్లుగా కసరత్తు చేశామని నిర్మల అన్నారు. సృజనాత్మక ఉత్పత్తులతో బ్యాంకులు డిపాజిట్లు పెంచుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News December 12, 2025

కలెక్షన్ల సునామీ.. వారంలో రూ.300 కోట్లు

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.300 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారత్‌లో రూ.218 కోట్లు వసూళ్లు చేయగా వరల్డ్ వైడ్‌గా రూ.313 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య ధార్ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో గల్ఫ్ కంట్రీస్ ధురంధర్‌ను బ్యాన్ చేశాయి.

News December 12, 2025

డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్‌పుర్‌లో ఇంటర్న్‌షిప్

image

DRDOకు చెందిన డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్‌పుర్‌ 20 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు స్టైపెండ్ రూ.5వేలు చెల్లిస్తారు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News December 12, 2025

ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం

image

ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా పేరు మార్చింది. అదే విధంగా ఏడాదికి 120 రోజుల పని దినాలను తప్పనిసరి చేసింది. ఈ స్కీంకు రూ.లక్షా 51 వేల కోట్లు కేటాయించింది.