News February 8, 2025

హీరోకు అరుదైన వ్యాధి.. కామెంట్స్ వైరల్

image

తాను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. దాని నుంచి కోలుకునేందుకు 7-8 ఏళ్లు పట్టినట్లు వెల్లడించారు. స్టార్ డమ్ ఎంజాయ్ చేయాల్సిన రోజుల్లో ఈ వ్యాధితో ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ఫ్యాన్స్ తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తనకు టెన్షన్ వచ్చేదని తెలిపారు. ఈ విషయమై డాక్టర్లను సంప్రదిస్తే దీని గురించి బయటపడిందన్నారు.

Similar News

News February 8, 2025

ఢిల్లీ రిజల్ట్స్: అత్యధిక మెజారిటీ ఎవరికంటే?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ(మటియా మహల్- 42,724 ఓట్లు)తో ఆప్ నేత మహమ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి దీప్తిపై విజయం సాధించారు. మరోవైపు అత్యల్ప మెజార్టీ(344 ఓట్లు)తో సంగం విహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ నెగ్గారు. ఓవరాల్‌గా ముగ్గురు BJP అభ్యర్థులు వెయ్యి లోపు మెజార్టీతో విజయం సాధించారు. పలు చోట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడటం గమనార్హం.

News February 8, 2025

నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

image

246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ <>నోటిఫికేషన్ <<>>విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. ఫీజు రూ.300. CBT, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌లో CBT పరీక్షలు జరగనున్నాయి. సైట్: iocl.com

News February 8, 2025

లిక్కర్ స్కామ్‌లో భాగమైన మూడు పార్టీలు బలి!

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్‌లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు.

error: Content is protected !!