News August 5, 2024
నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.. ట్విస్ట్ ఏంటంటే!

కోర్టు కేసు విచారణలో జాప్యం ఓ ఖైదీకి శాపంగా మారిన ఘటన ఇది. సిద్ధిపేట(D) పెద్దగుండవెల్లికి చెందిన పోచయ్య తల్లిని హత్య చేసిన కేసులో 2013లో అరెస్టయ్యారు. సిద్దిపేట కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా, దీనిపై ఆయన కుమారుడు హైకోర్టుకెళ్లారు. ఈ జులైలో హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేల్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2018లో అనారోగ్యంతో పోచయ్య జైలులోనే మరణించారు. మృతిపై సమాచారం లేక హైకోర్టు కేసును విచారించింది.
Similar News
News December 5, 2025
అఖండ-2పై లేటెస్ట్ అప్డేట్

ఫైనాన్స్, లీగల్ ఇష్యూలతో అఖండ-2 సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఓ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు వెల్లడించాయి. అలాగే బాలకృష్ణ, బోయపాటి తమ రెమ్యునరేషన్లో కొంతభాగం వదులుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు రావాల్సిన రూ.28 కోట్లు+వడ్డీలో ఇప్పటికిప్పుడు 50% చెల్లించాలని <<18465729>>ఈరోస్<<>> డిమాండ్ చేస్తోందట. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<


