News October 8, 2025
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు GOపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. బిల్లు పాస్ అయిందా అని ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దు అవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. వన్మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2026
18వ స్థానంలో గుంటూరు జిల్లా

ఫిబ్రవరి 2026కు సంబంధించిన పీహెచ్సీ పనితీరు ర్యాంకింగ్స్లో గుంటూరు జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 24 పీహెచ్సీలలో 1 A గ్రేడ్, 13 B, 8 C, 2 D గ్రేడ్లు సాధించాయి. మొత్తం 120 మార్కుల్లో 85 మార్కులు పొందింది. వెనుకబడిన ప్రాంతాల్లో సేవల మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ, మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.
News April 4, 2026
రాఘవ్ చడ్ఢా రాజ్యసభ సభ్యత్వం పోతుందా?

రాజ్యసభ డిప్యూటీ లీడర్గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆప్ ఇప్పుడు ఆయన్ను MPగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ఎంపీని తొలగించే హక్కు పార్టీకి ఉండదు. పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేసినా రాజ్యసభ సభ్యత్వం కొనసాగుతుంది. 6 ఏళ్లు సభ్యుడిగా టర్మ్ పూర్తి చేయొచ్చు. విభేదాలున్నా సరే ఆప్ నుంచి రాఘవ్ చడ్ఢాను ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
News April 4, 2026
కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోంది: బొత్స

AP: అమరావతిలో కృష్ణా కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోందని YCP నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘అమరావతిపై GOVTది ప్రచారార్భాటమే. అక్కడి అవినీతికి తప్ప YCP దానికి వ్యతిరేకం కాదు. తీర్మానాలతో అమరావతి పర్మినెంట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. దాన్ని శాసన రాజధానిగానే చూస్తాం. రెండేళ్లైనా నిర్మాణాలు పూర్తిచేయలేదు’ అని మండిపడ్డారు. అనేక సమస్యలుండగా అమరావతినే అభివృద్ధి చేస్తామంటే కుదరదన్నారు.


