News June 24, 2024

వాలంటీర్ల రాజీనామా అంశంపై హైకోర్టు విచారణ

image

AP: వాలంటీర్ల రాజీనామాల అంశంపై BYC పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు 64వేల మంది రాజీనామా చేశారని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇందులో కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని, వాలంటీర్ల ఫిర్యాదులతో YCP నేతలపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని EC, ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను 4వారాలకు వాయిదా వేసింది.

Similar News

News December 3, 2025

బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

image

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

News December 3, 2025

ఏపీ న్యూస్ అప్‌డేట్స్

image

*ధాన్యం సేకరణలో రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు
*పోలవరం ప్రధాన డ్యామ్‌లో రూ.543 కోట్లతో చేపట్టే అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి
*విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగుల జీతాల్లో కోత. 100% ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటన. నేడు నిరసనకు కార్మికుల పిలుపు
*హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ డిమాండ్

News December 3, 2025

పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి ఇది

image

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ పశుగ్రాసం సాగు, ప్రత్యేకతల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.