News August 13, 2024

EWS కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

AP: వైద్య కళాశాలల్లో EWS కోటా సీట్ల జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీట్లు పెంచకుండానే EWS కోటా అమలు చేస్తున్నారని, దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. సీట్లు పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News November 14, 2025

కౌంటింగ్‌లో కుట్రకు ప్లాన్: తేజస్వీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదింపజేసేందుకు రేపు కుట్ర జరుగుతుందని RJD నేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మహాగఠ్‌బంధన్‌ అభ్యర్థులు గెలిస్తే ప్రకటించవద్దని, తొలుత ఎన్డీయే అభ్యర్థుల గెలుపునే ప్రకటించాలని అధికారులకు చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఫోన్లు చేశారని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News November 14, 2025

గొంతులో మటన్ ముక్క.. ఊపిరాడక వ్యక్తి మృతి

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి తాపీ మేస్త్రీలకు ఓ ఇంటి యజమాని దావత్ (విందు) ఏర్పాటు చేశారు. అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య (65) గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.

News November 13, 2025

IPL: ఆ జట్టులోకి సచిన్ కొడుకు!

image

IPL: సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్నట్లు ESPNCricinfo తెలిపింది. ముంబై నుంచి రూ.30 లక్షల ధరకు లక్నోకు వెళ్లారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని పేర్కొంది. ఇతడిని 2021 వేలంలో రూ.20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. 2025 వరకు కేవలం 5 మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. IPL కెరీర్‌లో ఈ ఆల్‌రౌండర్ 3 వికెట్లు తీయడంతో పాటు 114 రన్స్ చేశారు.