News December 13, 2024

నలుగురు కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు

image

TG: రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 నెలలకే పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం ఏడాది దాటినా పట్టించుకోలేదని కొండల్ రెడ్డి అనే వ్యక్తి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు ధిక్కరణ కింద ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

Similar News

News December 8, 2025

మూసిన గదిలో రాసిన పత్రం కాదిది: భట్టి

image

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసిన గదిలో రాసిన పత్రం కాదని, ఇది ప్రజల పత్రమని గ్లోబల్ సమ్మిట్‌లో Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమన్నారు. కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంశాలతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళా శక్తి, రైతుభరోసా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్-1గా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 8, 2025

అంగారకుడిపైనా గంగా తరహా నదీ వ్యవస్థ

image

జీవనానికి అనుకూలమైన గ్రహం కోసం చేస్తోన్న అన్వేషణలో కీలక ముందడుగు పడింది. INDలో గంగా నదీ వ్యవస్థ మాదిరిగానే అంగారకుడిపైనా వాటర్ నెట్‌వర్క్ ఉండేదని టెక్సాస్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. అక్కడ 16 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలను వారు మ్యాపింగ్ చేశారు. ‘బిలియన్ ఏళ్ల కిందట మార్స్‌పై వర్షాలు కురిసేవి. జీవం కూడా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలి’ అని చెప్పారు.

News December 8, 2025

వీళ్లతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తోంది: CBN

image

AP: పరకామణి చోరీని చిన్న నేరంగా చెప్పడాన్ని ఏమనాలని CBN ప్రశ్నించారు. ‘TTD ప్రసాదానికి కల్తీనెయ్యి సరఫరా చేసినా వెనుకేసుకొస్తారా? ప్రతిపక్షంలో ఉన్న ఇటువంటి వాళ్లతో రాజకీయం చేయడానికి నాకు సిగ్గనిపిస్తోంది’ అని జగన్‌పై మండిపడ్డారు. సింగయ్య అనే వ్యక్తిని కారుకింద తొక్కించి ఆయన భార్యతో తమపై ఆరోపణలు చేయించారని విమర్శించారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.