News August 12, 2024
హిండెన్బర్గ్ ఎఫెక్ట్.. రూ.53వేల కోట్ల సంపద ఆవిరి!

అదానీ, సెబీ చీఫ్ మాధబీపై హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదానీ స్టాక్స్ 7శాతానికి పైగా నష్టపోవడంతో రూ.53వేల కోట్ల సంపద ఆవిరైంది. BSEలోని అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర రూ.1656కు పడిపోయింది. అదానీ పవర్ 4%, విల్మర్, ఎనర్జీ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజెస్ 3% చొప్పున నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలోని అదానీ పోర్ట్స్ 2% డౌన్ ఫాల్ అయింది.
Similar News
News February 28, 2026
చెరకు పంటలో జింకు లోపం – నివారణ

చెరకు పిలకదశలో జింకు లోపం కనిపిస్తే మొక్కల ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడతాయి. లోపం ఎక్కువైతే పెరుగుదల తగ్గి, దుబ్బు చేయడం నిలిచిపోయి, కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. దీని కట్టడికి లోపం కనిపించిన తోటలపై లీటరు నీటికి జింకు సల్ఫేట్ 2గ్రా. కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ముందే ఎకరాకు 20kgల జింక్ సల్ఫేట్ నేలలో వేస్తే జింకు లోపం రాకుండా నివారించవచ్చు.
News February 28, 2026
IIIT నాగపూర్లో పోస్టులు

<
News February 28, 2026
వేసవి కాలంలో రక్తదానం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

వేసవి కాలంలో రక్తదానం చేసేవారు హైడ్రేటెడ్గా ఉండటం ముఖ్యం. ఇందుకోసం రక్తదానానికి ముందు, తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. పండ్ల రసాలు, గ్లూకోజ్ పానీయాలు తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రక్తదాన కేంద్రానికి వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా గొడుగు/టోపీ/స్కార్ఫ్ ధరించాలి. బ్లడ్ ఇచ్చిన తర్వాత 15-20min రెస్ట్ తీసుకోవాలి. భారీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, పప్పులు, ఖర్జూర వంటివి ఆహారంగా తీసుకోవాలి.


