News February 3, 2025

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి TDPదే

image

AP: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 23 ఓట్లు పడగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. దీంతో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు

image

AP: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టూ అందుబాటులోకి తేవాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని సూచించారు.

News February 13, 2025

రాష్ట్రపతి పాలనతో సంభవించే మార్పులివే

image

✒ రాష్ట్ర ప్రభుత్వం/మంత్రి మండలి రద్దవుతుంది.
✒ ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు ఉండవు.
✒ ప్రెసిడెంట్ ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటారు.
✒ పాలనలో గవర్నర్‌కు సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తుంది.
✒ రాష్ట్రానికి అవసరమైన బిల్లులను పార్లమెంట్ రూపొందిస్తుంది. ✒ అత్యవసర సమయాల్లో పాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీ చేస్తారు.

News February 13, 2025

రేపు బంద్.. స్కూళ్లకు సెలవు ఉందా?

image

రేపు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్‌కు మద్దతివ్వడంపై విద్యార్థి సంఘాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంపై నిర్ణయం ప్రకటించనున్నాయి. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

error: Content is protected !!