News March 6, 2025
దేశానికి న్యాయం జరిగేలా చరిత్రను రాయలేదు: నిర్మల

చరిత్రను జరిగింది జరిగినట్లుగా చెప్పాల్సిన సంస్కృతి మనదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘గతంలో చరిత్ర రాసిన వాళ్లు దేశానికి న్యాయం జరిగేలా రాయలేదు. దేశంపై ఆధిపత్యం చెలాయించిన వాళ్లు తమకు అనుకూలంగా చరిత్రను రాసుకునే ప్రయత్నం చేశారు. చరిత్రను వక్రీకరించడం పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
కేంద్ర మంత్రి కుటుంబంలో కాల్పుల కలకలం

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబ సభ్యుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. బిహార్లోని నవ్గచియాలో ఆయన మేనల్లుళ్లు అయిన విశ్వజిత్, జైజిత్ మధ్య నల్లా నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. విశ్వజిత్ బుల్లెట్ గాయాలతో మరణించగా జైజిత్, తల్లి(నిత్యనందరాయ్ సోదరి) గాయపడ్డారు. జైజిత్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని భాగల్పూర్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 20, 2025
అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారు: కేటీఆర్

TG: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపిందని కేటీఆర్ విమర్శించారు. తాజా బడ్జెట్ను ఉద్దేశించి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని దుయ్యబట్టారు. అధికారం కోసం అశోక్ నగర్ వెళ్లి, తీరా అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ అరాచక పాలన రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని నిలదీశారు.
News March 20, 2025
రోజూ డబ్బు ఇస్తేనే భార్య కాపురం చేస్తానంటోంది: సాఫ్ట్వేర్ ఉద్యోగి

రోజూ రూ.5,000 ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటోందని బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. WFH జూమ్ కాల్స్ వేళ భార్య కొట్టేదని, ల్యాప్టాప్ ముందు డాన్స్ కూడా చేయడంతో జాబ్ పోయిందని తెలిపాడు. 60 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు వద్దంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకులు అడిగితే రూ.45లక్షలు డిమాండ్ చేస్తోందన్నాడు. అయితే మరో పెళ్లి కోసమే భర్త ఇలా ఆరోపిస్తున్నాడని భార్య చెబుతోంది.