News December 1, 2024
దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి: YCP MP

AP: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఢిల్లీ వాతావరణం సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందని వివరించారు. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో సమావేశాలు పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి.
Similar News
News January 22, 2026
జనసేనపై కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్

AP: జనసేనపై జరుగుతున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించాలని పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ‘ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, కుల విభేదాలను జనసేనకు ఆపాదించాలని కొందరు కిరాయి వక్తలు, మాధ్యమాలు కుట్రలు పన్నుతున్నాయి. వివాహేతర సంబంధాల రచ్చను కూడా రుద్దాలని చూస్తున్నాయి. అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్ సూచించినట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.
News January 22, 2026
BCCIపై పిల్… డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

BCCIని భారత క్రికెట్ టీమ్ ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేయడాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన PILను SC డిస్మిస్ చేసింది. ‘BCCI కాకుంటే ఇంకేది ఉంటుంది? 2, 3 టీములుంటే వాటి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడలా లేదు కనుక ఇష్యూయే లేదు’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ గుర్తింపు ఉందని, దాన్ని ఎలా ప్రశ్నిస్తామని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. జాతీయ క్రీడా చట్టం నియంత్రణ కూడా ఉంటుందన్నారు.
News January 22, 2026
సంక్రాంతి పందేల్లో రూ.2వేల కోట్లు చేతులు మారాయి: జగన్

AP: సంక్రాంతి వేళ ఎమ్మెల్యేలే కోడి పందేలు ఎలా నిర్వహించారని వైసీపీ చీఫ్ జగన్ ప్రశ్నించారు. ‘ఈ సందర్భంగా రూ.2వేల కోట్లు చేతులు మారాయి. ప్రభుత్వమే ఈ పందేలను ప్రోత్సహించింది. పోలీసులు, నాయకులు వాటాలు పంచుకున్నారు. గ్యాంబ్లింగ్కు చట్టబద్ధత కల్పించారా? చంద్రబాబు అన్ని చెడ్డ అలవాట్లు, గుణాలు ఉన్న చెడ్డ వ్యక్తి’ అని ఫైరయ్యారు.


