News May 24, 2024

ఆ జిల్లాల్లో ఈ నెల 27న ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు: ఈసీ

image

TG: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు ఈసీ సూచించింది.

Similar News

News February 18, 2025

భారత్‌లో అడుగుపెట్టనున్న టెస్లా..!

image

ఈవీ దిగ్గజం టెస్లా భారత్‌లో రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఈ మేరకు లింక్డిన్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. కస్టమర్‌రిలేటడ్, బ్యాక్ఎండ్ జాబులు భర్తీ చేయనుంది. జాబ్‌లొకేషన్ ముంబయి, ఢిల్లీఅని పేర్కొంది.ఇటీవలే భారత్ రూ.34 లక్షల పైన ధర ఉన్నకార్లకి ట్యాక్స్ 110శాతం నుంచి70కు తగ్గించింది. అంతేకాకుండా మోదీUSA పర్యటనలో ప్రధానితో మస్క్‌భేటీఅయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

News February 18, 2025

3 నెలలుగా ‘గృహలక్ష్మి’ స్కీమ్ డబ్బుల్లేవ్!

image

కర్ణాటక గ్యారంటీ స్కీములను నిధుల కొరత వేధిస్తోంది. 3 నెలలుగా లబ్ధిదారుల అకౌంట్లలో గృహలక్ష్మి డబ్బులు వేయడం లేదు. అన్నభాగ్య సహా మరికొన్ని స్కీములకూ బదిలీ చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, త్వరలోనే వేస్తామని Dy CM DK శివకుమార్ తెలిపారు. 3 నెలలుగా డబ్బులు వేయడం లేదన్న సంగతి తనకు తెలియదని CM సిద్దరామయ్య అన్నారు. ఏదేమైనా స్కీములను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్.

News February 18, 2025

భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

image

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్‌లో విండీస్‌పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్‌పై ఈ స్కోర్లు చేశారు.

error: Content is protected !!