News April 10, 2025
భారీగా తగ్గనున్న హోమ్ లోన్ EMI

ఆర్బీఐ రెపో రేటును 6 శాతానికి తగ్గించడంతో లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా గృహ రుణదారులకు నెలవారీ EMIలు భారీగా తగ్గనున్నాయి. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధితో రూ.30 లక్షల లోన్ ఉంటే నెలవారీ EMI రూ.26,247 నుంచి రూ.25,071కి తగ్గనుంది. ప్రతినెలా రూ.1,176, 20 ఏళ్లకు రూ.2.82 లక్షలు ఆదా కానుంది. రూ.50 లక్షలు, రూ.70 లక్షలు, రూ.కోటి. రూ.1.5 కోట్లకు ఎంత మిగులుతుందో పైన ఫొటోలో చూడొచ్చు.
Similar News
News January 7, 2026
శునకాలు x సుప్రీంకోర్టు/ప్రజలు.. ఏమంటారు?

దేశంలోని రోడ్లు, పబ్లిక్ ప్లేసుల్లో శునకాలు తిరగడంపై సుప్రీంకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. ‘కుక్క ఎప్పుడు కరిచే మూడ్లో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి వాటిని షెల్టర్స్కు తరలించాలి. హైవేలపై డాగ్స్ కరవకపోవచ్చు. కానీ ప్రమాదాలకు కారణం అవుతాయి. చికిత్స కంటే నిరోధం ఉత్తమం’ అని వ్యాఖ్యానించింది. ప్రజల, కుక్కల లైఫ్ దృష్ట్యా SC ఇస్తున్న ఆదేశాలపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకీ మీరేమంటారు?
News January 7, 2026
కంది గింజలను నిల్వచేసే సమయంలో జాగ్రత్తలు

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.
News January 7, 2026
రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP: రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించింది. ఆ రోజు 6PM నుంచి 12AM లోపు స్పెషల్ షో వేసుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 (GSTతో కలిపి) పెంచుకోవచ్చని పేర్కొంది.


